ట్రాక్టర్‌ బోల్తా- డైవర్‌ మృతి

ABN , First Publish Date - 2021-07-31T04:37:43+05:30 IST

ట్రాక్టర్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి చెందాడు.

ట్రాక్టర్‌ బోల్తా- డైవర్‌ మృతి
మృతి చెందిన అంజి

మల్దకల్‌, జూలై 30: ట్రాక్టర్‌ బోల్తా పడి డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని బిజ్వారం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. బిజ్వారం గ్రామానికి చెందిన అంజి (18) ఓ రైతుకు చెందిన పొలంలో సాయంత్రం వర కు పని చేసి  ఇంటికి వస్తుండగా గ్రామ పొలిమేరలో ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడింది. చుట్టుప్రక్కల రైతులు సంఘటనా స్థలానికి  చేరుకొని మృతుడిని బయటకు లాగారు.  మృతుడికి తల్లి, తమ్ముడు ఉన్నారు. ప్రభుత్వం స్పందించి సహాయం చేయాలని గ్రామస్థులు కోరారు.  

Updated Date - 2021-07-31T04:37:43+05:30 IST