చెయ్యేరులో ట్రాక్టర్ పోటీలు
ABN , First Publish Date - 2022-01-17T05:08:56+05:30 IST
సంక్రాంతి సంబరాలలో భాగంగా ఆదివారం కనుమ సందర్భంగా మధ్యాహ్నం చెయ్యేరులో ట్రాక్టర్ పోటీలు నిర్వహించారు.
నందలూరు, జనవరి 16 : సంక్రాంతి సంబరాలలో భాగంగా ఆదివారం కనుమ సందర్భంగా మధ్యాహ్నం చెయ్యేరులో ట్రాక్టర్ పోటీలు నిర్వహించారు. గుండు మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పోటీలను జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాధరెడ్డి ప్రారంభించారు. పోటీల్లో కుమ్మరపల్లె గ్రామానికి చెందిన ఎల్.వినయ్ రాజు విజేతగా నిలిచి ప్రథమ బహుమతి రూ.10వేలు అందుకున్నారు. తాళ్లపాక గ్రామానికి చెందిన రామ్మోహన్రాజు ద్వితీయ స్థానంలో నిలిచి రూ.8వేలు, తొగూరుపేట గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం తృతీయ స్థానంలో నిలిచి రూ.5వేలు అందుకున్నారు.