రాజంపేటలో ట్రాక్టర్‌, కారు ఢీ

ABN , First Publish Date - 2021-07-27T04:42:51+05:30 IST

రాజంపేట పట్టణ సమీపంలోని కడప-చెన్నై హైవే రోడ్డులో హిందుస్థాన్‌ పెట్రోలు బంక్‌ వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు.

రాజంపేటలో ట్రాక్టర్‌, కారు ఢీ
పొలాల్లోకి దూసుకుపోయిన కారు

విరిగిపడ్డ కారు ఇంజన్‌ 

ఐదుగురికి గాయాలు

రాజంపేట టౌన్‌, జూలై 26 : రాజంపేట పట్టణ సమీపంలోని కడప-చెన్నై హైవే రోడ్డులో హిందుస్థాన్‌ పెట్రోలు బంక్‌ వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను కారు ఢీకొనడంతో కారు ఇంజన్‌ ఊడిపడి కారు పక్కనున్న పొలాల్లోకి దూసుకుపోయింది. గాయపడ్డ ఐదుగురిలో ఖలీల్‌, పురుషోత్తం అనే వ్యక్తులకు తీవ్రగాయాలు కావడంతో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స చేసి మెరుగైన వైద్య చికిత్స కోసం తిరుపతికి తరలించారు. 


ఖాజీపేటలో ఇద్దరికి గాయాలు

ఖాజీపేట, జూలై 26: కడప-కర్నూలు జాతీయ రహదారి సిద్దాంతిపురం బైపాస్‌ రోడ్డు వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు బ్రహ్మంగారిమఠం మండలంలో వీఆర్‌ఏలుగా పనిచేస్తున్న ఖాసీంపీరా, కర్ణ ద్విచక్ర వాహనంలో కడపకు వెళ్లి తిరిగి వస్తుండగా సిద్దాంతిపురం బైపా్‌స రోడ్డు వద్దకు రాగానే కారు ఢీకొని గాయపడ్డారు. వారిని 108 వాహనం ద్వారా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2021-07-27T04:42:51+05:30 IST