ట్రాక్టర్‌ బోల్తా : యువకుడి దుర్మరణం

ABN , First Publish Date - 2021-05-17T06:28:14+05:30 IST

ట్రాక్టర్‌ తిరగబడి నవీన్‌ (20) అనే యువకుడు మృతి చెందినట్టు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.

ట్రాక్టర్‌ బోల్తా  : యువకుడి దుర్మరణం
బోల్తాపడిన ట్రాక్టర్‌.. సంఘటనా స్థలంలో యువకుడి మృతదేహం

 పెనుగొండ, మే 16: ట్రాక్టర్‌ తిరగబడి నవీన్‌ (20)  అనే  యువకుడు మృతి చెందినట్టు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అంకం పాలెం గ్రామానికి చెందిన కొడమంచిలి శ్రీనివాస్‌ కుమారులు నవీన్‌, నరేష్‌  రావులపాలెం ఇటుక బట్టీలో పని చేస్తున్నారు. ఆదివారం  తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇటుకల లోడుతో ట్రాక్టర్‌పై పాలకొల్లు బయలు దేరారు. 5.30 గంటల సమయంలో పెనుగొండలోని మల్లప్పదిబ్బ వద్ద పెద్దింట్లమ్మ గుడి సమీపంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ అతి వేగంగా  ట్రాక్టర్‌ను నడపడంతో ట్రాక్టర్‌ రోడ్డుపక్కన గల బోదెలో తిరగబడింది. ట్రక్కు కింద నవీన్‌ పడి మృతి చెందినట్టు తెలిపారు.   కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-05-17T06:28:14+05:30 IST