రోడ్డుప్రమాదంలో ఒకరి మృతి.. మరొకరికి తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2020-10-31T10:07:32+05:30 IST

రోడ్డుప్రమాదంలో ఒకరి మృతి.. మరొకరికి తీవ్రగాయాలు

రోడ్డుప్రమాదంలో ఒకరి మృతి.. మరొకరికి తీవ్రగాయాలు

మదనపల్లె క్రైం, అక్టోబరు 30: పుంగనూరు మండలం కృష్ణాపురం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చౌడేపల్లె మండలం బోయకొండ సమీపంలోని యానాదిపాళెంకు చెందిన నాగరాజ(25), సిద్దప్ప(26) అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తున్నారు. శుక్రవారం వీరిద్దరూ నన్నారి గడ్డల కోసం ద్విచక్రవాహనంపై పుంగనూరుకు బయలుదేరారు. వీరిని మార్గమధ్యంలో కృష్ణాపురం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈంతో తీవ్రంగా గాయపడిన వీరిని స్థానికులు 108 వాహనంలో మదనపల్లె జిల్లా వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు నాగరాజను పరీక్షించి మార్గమధ్యంలో మృతిచెందినట్లు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన సిద్దప్పకు మెరుగైన వైద్యం అందించారు. నాగరాజకు భార్య ఈశ్వరమ్మ, కుమారుడు ఉన్నారు. ఆస్పత్రిలోని ఔట్‌పోస్టు పోలీసులు ఘటనపై బాధిత కుటుంబీకులకు, పుంగనూరు పోలీసులకు సమాచారం అందించారు. నాగరాజ కుటుంబీకులు ఆస్పత్రికి చేరుకుని భోరున విలపించారు. ఈ ఘటనతో యానాదిపాళెంలో విషాదం అలుముకుంది.  


Updated Date - 2020-10-31T10:07:32+05:30 IST