తిరుపతి అర్బన్‌ ఎస్పీకి స్కోచ్‌ మెరిట్‌ అవార్డు

ABN , First Publish Date - 2020-10-30T11:43:43+05:30 IST

తిరుపతి అర్బన్‌ ఎస్పీ రమేష్‌రెడ్డికి స్కోచ్‌ మెరిట్‌ జాతీయ అవార్డు లభించింది.

తిరుపతి అర్బన్‌ ఎస్పీకి స్కోచ్‌ మెరిట్‌ అవార్డు

 లాక్‌డౌన్‌లో అందించిన సేవలకు గుర్తింపు


తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 29: తిరుపతి అర్బన్‌ ఎస్పీ రమేష్‌రెడ్డికి స్కోచ్‌ మెరిట్‌ జాతీయ అవార్డు లభించింది. పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో అత్యుత్తమ సేవలందించినందుకు, సమాజాన్ని ప్రభావితం చేసేలా పనిచేసిన వారికి ఏటా కేంద్ర హోంశాఖ ‘స్కోచ్‌గ్రూప్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ అవారు’్డలను అందజేస్తోంది. ఈ జాతీయస్థాయి అవార్డులను బుధవారం రాత్రి ప్రకటించారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో అత్యుత్తమ సేవలు అందించినందుకుగాను ఆయనకు ఈ అవార్డు లభించింది. కరోనా సమయంలో పేదలు, అనాథలు, వలస కూలీలు, యాచకులను గుర్తించి అన్నపానీయాలు అందించడమే అందించడం.. అనాథలకు ఆశ్రయం కల్పించేందుకు ఎస్పీ కృషి చేశారు. స్కోచ్‌ మెరిట్‌ అవార్డు లభించిన రమేష్‌రెడ్డిని ఏఎస్పీ సుప్రజ, తిరుమల ఏఎస్పీ మునిరామయ్య, డీఎస్పీలు గంగయ్య (ఎస్‌.బి), మరళీకృష్ణ (ఈస్ట్‌), నరసప్ప (వెస్ట్‌), మల్లిఖార్జున (ట్రాఫిక్‌), మురళీధర్‌ (క్రైమ్‌), రామరాజు (దిశ), నందకిషోర్‌, లక్ష్మణ్‌కుమార్‌ (ఏఆర్‌) తదితరులు కలిసి అభినందనలు తెలియజేశారు.  సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో జాతీయ స్థాయిలో పోలీసు శాఖకు అవార్డులను ప్రకటించగా, తిరుపతి అర్బన్‌, చిత్తూరు జిల్లాలకు ఒక్కో అవార్డు లభించింది. 

Updated Date - 2020-10-30T11:43:43+05:30 IST