పదోన్నతి పొందిన డీఎస్పీలకు పోస్టింగులు
ABN , First Publish Date - 2020-10-01T10:31:31+05:30 IST
జిల్లాలో పనిచేస్తున్న పలువురు డీఎస్పీలు ఇటీవల ఏఎస్పీలుగా పదోన్నతి పొందిన విషయం విదితమే. వీరందరికీ పోస్టింగులు ఇస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
చిత్తూరు, సెప్టెంబరు 30: జిల్లాలో పనిచేస్తున్న పలువురు డీఎస్పీలు ఇటీవల ఏఎస్పీలుగా పదోన్నతి పొందిన విషయం విదితమే. వీరందరికీ పోస్టింగులు ఇస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు.. పలమనేరు డీఎస్పీ అరీఫుల్లాను తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా శాంతిభద్రతల విభాగ ఏఎస్పీగా నియమించారు.
చిత్తూరులో పనిచేస్తున్న డీఎస్పీ ఈశ్వర్రెడ్డి చిత్తూరు పోలీసు జిల్లా ఓఎస్డీగా నియమితులయ్యారు. శ్రీసిటీ డీఎస్పీ విమలకుమారిని మెరైన్ ఏఎస్పీగానూ, శ్రీకాళహస్తి డీఎస్పీ నాగేంద్రుడు అనంతపురం జిల్లా అడ్మిన్ విభాగ ఏఎస్పీగా బదిలీ అయ్యారు. ఇక కర్నూలు డీఎస్పీ భాస్కర్రెడ్డి తిరుపతి అర్బన్ జిల్లా ఎస్ఈబీ ఏఎస్పీగా బదిలీపై వస్తున్నారు.