దూర ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నాం

ABN , First Publish Date - 2020-10-01T10:28:13+05:30 IST

ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి నుంచి బెంగళూరు, విజయవాడ, కర్నూలు, అనంతపురం, శ్రీశైలం, కాణిపాకం, ఇతర మార్గాల్లోనూ బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్‌ ప్రవీణ్‌కుమార్‌ బుధవారం తెలిపారు.

దూర ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నాం

తిరుపతి (రవాణా), సెప్టెంబరు 30: ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి నుంచి బెంగళూరు, విజయవాడ, కర్నూలు, అనంతపురం, శ్రీశైలం, కాణిపాకం, ఇతర మార్గాల్లోనూ బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్‌ ప్రవీణ్‌కుమార్‌ బుధవారం తెలిపారు. తిరుపతి-విజయవాడ ఉదయం 9.10, 10.30, 11, 12, రాత్రి 10, 10.20, 11.59 గంటలకు, బెంగళూరుకు ఉదయం 6, 8, మధ్యాహ్నం 2, 3, రాత్రి 10.45, 11.15 గంటలకు, కర్నూలుకు రాత్రి 9.15 గంటలకు, అనంతపురానికి రాత్రి 11కు, శ్రీశైలానికి ఉదయం 7.45, రాత్రి 8 గంటలకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకూ బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-10-01T10:28:13+05:30 IST