రైతులను బిజెపి, టీఆర్ఎస్ రెండూ మోసం చేస్తున్నాయ్: Revant reddy

ABN , First Publish Date - 2022-05-05T20:49:19+05:30 IST

తెలంగాణలో రైతులను మోసం చేసేందుకు బిజెపి, టీఆర్ఎస్ రెండూ పోటీ పడుతున్నాయని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.

రైతులను బిజెపి, టీఆర్ఎస్ రెండూ మోసం చేస్తున్నాయ్: Revant reddy

హైదరాబాద్: తెలంగాణలో రైతులను మోసం చేసేందుకు bjp, trs రెండూ పోటీ పడుతున్నాయని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. వడ్లు కొనుగోలు చేయాలని రైతులు అడుగుతుంటే ధర్నాల పేరుతో బీజేపీ, టీఆర్ఎస్‌ నాటకాలు ఆడుతున్నాయని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు అండగా ఉండేందుకే రాహుల్‌ రాష్ట్ర పర్యటన చేస్తున్నారని అన్నారు.కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తామనేది ప్రకటిస్తామన్నారు. సీఎం కేసీఆర్ అవినీతికి అవధులు లేవని రేవంత్ రెడ్డి ఆరోపించారు.యాదాద్రి ఆలయ నిర్మాణంలో కేసీఆర్‌ కుటుంబం అవినీతికి పాల్పడిందన్నారు.కేసీఆర్ కుటుంబం ఆస్తులు నిజాం సంపదను మించిపోయాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

Read more