యువతను మోదీ, కేసీఆర్ మోసం చేస్తున్నారు: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-06-28T00:21:29+05:30 IST

యువతను ఒక పక్క మోదీ, మరోపక్క కేసీఆర్ మోసం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.

యువతను మోదీ, కేసీఆర్ మోసం చేస్తున్నారు: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: యువతను ఒక పక్క మోదీ, మరోపక్క కేసీఆర్ మోసం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏళ్లతరబడి ఖాళీలను భర్తీ చేయడం లేదని అన్నారు. దేశాన్ని కాపాడే ఆర్మీలో కాంట్రాక్ట్ పద్ధతి తీసుకురావడం దారుణమని అన్నారు. సికింద్రాబాద్ అల్లర్ల నిరసనకారులపై కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.అగ్నిపథ్‌పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదని నిలదీస్తే క్రిమినల్ కేసులు పెట్టి.. బేడీలు వేసి అరెస్ట్ చేశారని అన్నారు.


22 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కుటుంబాలను సీఎంకేసీఆర్ కనీసం పరామర్శించలేదన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌పై పోరాటం చేస్తున్న విద్యార్థులపై కేసులు పెట్టారు.వరంగల్ డిక్లరేషన్‌తో రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని,కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 

Updated Date - 2022-06-28T00:21:29+05:30 IST