ధరణి...భూ సమస్యలపై టీపీసీసీ కమిటీ: రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2021-11-20T21:03:36+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణి, భూ సంస్కరణల అంశాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు.

ధరణి...భూ సమస్యలపై టీపీసీసీ కమిటీ: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణి, భూ సంస్కరణల అంశాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కమిటీకి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహ ఛైర్మన్ గా వ్యవహరిస్తారని తెలిపారు. అలాగే  కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి కన్వీనర్ గానూ  సభ్యులుగా ఈరవర్తి అనిల్, బెల్లయ్య నాయక్, కొండపల్లి దయాసాగర్, ప్రత్యేక ఆహ్వానితులుగా కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, దళిత కాంగ్రెస్ చైర్మన్ ప్రీతమ్ లను నియమిస్తూ రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఈ కమిటీ ధరణి, అసైన్డ్ భూములు, వక్ఫ్ భూములు, భూ సేకరణ అంశాలపై అధ్యయనం చేసి 45 రోజులలో టీపీసీసీ కి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 

Updated Date - 2021-11-20T21:03:36+05:30 IST