మోడీ మెడలు వంచిన రైతులు: రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2021-11-19T22:15:08+05:30 IST

రైతు చట్టాలు వెనక్కి తీసుకోవడం కోసం రైతులు చేసిన పోరాటంతో వారు విజయం సాధించారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు.

మోడీ మెడలు వంచిన రైతులు: రేవంత్ రెడ్డి

కామారెడ్డి: రైతు చట్టాలు వెనక్కి తీసుకోవడం కోసం రైతులు చేసిన పోరాటంతో వారు విజయం సాధించారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు.కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకున్న నేపద్యంలో శుక్రవారం కామారెడ్డిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరేంద్ర మోడీ మెడలు వంచేవిధంగా రైతులు పోరాటం చేశారని ఆయన పేర్కొన్నారు. అయితే కేవలం యూపీ ఎన్నికల కోసమే బిజెపి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రేవంత్ విమర్శించారు. ప్రాణాలు పోయిన రైతు కుటుంబాలకు మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 50 లక్షల పరిహారం ఇవ్వాల్సిందేనన్నారు.


వరిధాన్యం కొనుగోలులో తెలంగాణ ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు.రైతులపై కక్ష సాధింపులో భాగంగానే కేసీఆర్ ధాన్యం కొనడం లేదని ఆయన పేర్కొన్నారు.టిఆర్ఎస్ బీజేపీలు వీధి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. ఎవరికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారో బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. వైన్స్ అప్లికేషన్ల తో వచ్చిన 12 వేలకోట్ల ఆదాయంతో ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు.

Updated Date - 2021-11-19T22:15:08+05:30 IST