గాంధీ కుటుంబంపై కేంద్రం అక్రమ కేసులు పెట్టింది:Revant reddy
ABN , First Publish Date - 2022-06-13T21:04:51+05:30 IST
గాంధీ కుటుంబంపై కేంద్రం అక్రమ కేసులు పెట్టిందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి(revant reddy) ఆరోపించారు.
హైదరాబాద్: గాంధీ కుటుంబంపై కేంద్రం అక్రమ కేసులు పెట్టిందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి(revant reddy) ఆరోపించారు. సోనియా, రాహుల్ గాంధీపై కేసులు పెట్టడం దుర్మార్గమని ఆయన అన్నారు.సోనియా కుటుంబంపై ఈగ వాలినా సహించేది లేదని రేవంత్రెడ్డి హెచ్చరించారు.నేషనల్ హెరాల్డ్ పత్రికను బ్రిటీషర్లు నిషేధించారని రేవంత్రెడ్డి అన్నారు.స్వాతంత్ర్య పోరాటంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక కీలకపాత్ర పోషించిందన్నారు.దేశ సమగ్రత కోసం పత్రికను మళ్లీ నడపాలని నిర్ణయించారని,పత్రిక నష్టాల్లో ఉంటే కాంగ్రెస్ రూ.90 కోట్లు ఇచ్చిందని రేవంత్రెడ్డి తెలిపారు.
బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించడానికి పత్రిక నడుస్తోందన్నారు.2015లో ముగిసిన విచారణను మోదీ సర్కార్ మళ్లీ తెరపైకి తెచ్చిందన్నారు.సోనియా, రాహుల్ గౌరవాన్ని తగ్గించే కుట్ర చేస్తున్నారని రేవంత్రెడ్డి ఆరోపించారు. కేంద్రంతీరును ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్దిచెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.