రైతు సంఘర్షణ సభకు జాతీయస్థాయిలో గుర్తింపు - రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2022-05-16T23:54:13+05:30 IST

రాష్ట్రంలోని వరంగల్ లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు జాతీయ స్ధాయిలో గుర్తింపు వచ్చిందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు.

రైతు సంఘర్షణ సభకు జాతీయస్థాయిలో గుర్తింపు - రేవంత్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలోని వరంగల్ లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు జాతీయ స్ధాయిలో గుర్తింపు వచ్చిందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఏఐసిసి నిర్వహించిన చింతన్ శిబిర్లో వరంగల్ డిక్లరేషన్ గురించి మాట్లాడుకున్నారని చెప్పారు. చింతన్ శిబిర్ నిర్ణయాలు ఆమోదిస్తూ తీర్మానానికి నిర్ణయం తీసుకున్నట్టు రేవంత్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. వరంగల్ రైతు డిక్లరేషన్ను జనంలోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మే 21 నుంచి నెలరోజుల పాటు రైతు రచ్చబండ కార్యక్రమాలు జరుగతాయన్నారు. మే 21న ప్రతి నేత గ్రామాల్లో రైతు రచ్చబండ నిర్వహించాలని పిలుపునిచ్చారు.


జయశంకర్ స్వగ్రామంలో రచ్చబండ సభలో తాను పాల్గొంటానని రేవంత్ తెలిపారు. అక్టోబర్ 2 నుంచి రాహుల్గాంధీ పాదయాత్ర వుంటుందన్నారు. రాహుల్ పాదయాత్ర మొదట తెలంగాణలో చేయాలని తీర్మానం చేసినట్టు వెల్లడించారు. రాహుల్ పాదయాత్ర 100 కి.మీ. మేర తెలంగాణలో ఉండాలని భావిస్తున్నామన్నారు. 

Updated Date - 2022-05-16T23:54:13+05:30 IST