అధికారంలోకి రాగానే ‘DHARANI’ తీసేస్తాం: పొన్నాల

ABN , First Publish Date - 2022-05-21T19:04:05+05:30 IST

ధరణి పోర్టల్ వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని తీసేస్తామని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ రైతు

అధికారంలోకి రాగానే ‘DHARANI’ తీసేస్తాం: పొన్నాల

సిద్దిపేట జిల్లా: ధరణి పోర్టల్ వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని తీసేస్తామని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా కొమురవెళ్లి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతులు పండించే పంటకు మద్దతు ధర కల్పించడంతో పాటు కౌలు రైతులకు పంట రుణమాఫీ అమలు చేస్తామన్నారు. తెలంగాణలో రైతులు ధాన్యం కల్లాల వద్ద మరణిస్తుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం పంజాబ్ రైతులకు ఆర్థిక సాయం చేయడానికి వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. గతంలో మ్యానిఫెస్టోలో ప్రకటించిన వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని, కానీ సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాలు ఎంత వరకు అమలయ్యామని ప్రశ్నించారు.  

Updated Date - 2022-05-21T19:04:05+05:30 IST