నిర్విరామ విద్యుత్ ఇవ్వాల్సిందే: రేవంత్

ABN , First Publish Date - 2022-04-15T16:37:19+05:30 IST

రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి విద్యుత్ అంతరాయం ఏర్పడటంపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి ట్వీట్టర్ వేదికగా స్పందించారు.

నిర్విరామ విద్యుత్ ఇవ్వాల్సిందే: రేవంత్

హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి విద్యుత్ అంతరాయం ఏర్పడటంపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ‘‘పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్ కోతలు రైతులకు గుండెకోతను మిగుల్చుతున్నాయి. కేసీఆర్ తప్పుడు విధానాలతో విద్యుత్ వ్యవస్థను గుల్లచేసి పారేశాడు. కొనుగోళ్లలో ఆయనకు కమీషన్లు… విద్యుత్ వ్యవస్థలకు అప్పులు మిగిలాయి. ఏది ఏమైనా పంటలకు చివరి తడి పూర్తయ్యే వరకు నిర్విరామ విద్యుత్ ఇవ్వాల్సిందే’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.

Updated Date - 2022-04-15T16:37:19+05:30 IST