హుజురాబాద్ పరిణామాలపై భవిష్యత్తులో స్పందిస్తా: రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2021-11-03T03:07:03+05:30 IST

ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజాసమస్యలపై కాంగ్రెస్‌ పోరాడుతూనే ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. బల్మూరి వెంకట్‌ భవిష్యత్తులో..

హుజురాబాద్ పరిణామాలపై భవిష్యత్తులో స్పందిస్తా: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజాసమస్యలపై కాంగ్రెస్‌ పోరాడుతూనే ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. బల్మూరి వెంకట్‌ భవిష్యత్తులో మంచి నాయకుడు అవుతాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటమితో నిరాశ చెందకుండా వెంకట్‌ ప్రజలకు అందుబాటులో ఉంటాడన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, ఈ ఓటమి తనలో ఇంకా కసి, పోటీతత్వాన్ని పెంచిందని చెప్పారు. ఈ ఓటమి కాంగ్రెస్‌ కార్యకర్తలకు నిరాశ కలిగించిందన్నారు. తమ పార్టీలో కొందరు సీనియర్లకు స్వేచ్ఛ ఎక్కువ అని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా తనకు కొన్ని పరిమితులు ఉంటాయని, హుజురాబాద్‌ ఓటమి పరిణామాలపై భవిష్యత్తులో స్పందిస్తానని రేవంత్‌ పేర్కొన్నారు. 



Updated Date - 2021-11-03T03:07:03+05:30 IST