Revanth ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు
ABN , First Publish Date - 2021-12-27T14:03:03+05:30 IST
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. నేడు ఎర్రవల్లిలో రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. నేడు ఎర్రవల్లిలో రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే రచ్చబండకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. నిర్వహించి తీరుతామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్లు, అరెస్ట్లు చేస్తున్నారు. దుబ్బాకలో ఆరు గురు, భూంపల్లి పోలీసు స్టేషన్లో ఐదు గురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.