రేపు నాగార్జునసాగర్కు రేవంత్
ABN , First Publish Date - 2022-04-28T16:14:05+05:30 IST
టీపీసీసీ చీఫ్ రేవంత్ రేపు(శుక్రవారం) నాగార్జున సాగర్లో పర్యటించనున్నారు.
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రేపు(శుక్రవారం) నాగార్జున సాగర్లో పర్యటించనున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరంగల్ సభ సన్నాహక సమావేశంలో టీపీసీసీ చీఫ్ పాల్గొననున్నారు. ఈ సమావేశానికి సీనియర్ నేత జానారెడ్డి హాజరుకానున్నారు. కాగా... రేవంత్ ఉమ్మడి నల్గొండ పర్యటనపై కోమటిరెడ్డి, ఉత్తమ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాకు ఎవరు రావద్దని కోమటిరెడ్డి బాహాటంగానే చెప్పారు. ఈ నేపథ్యంలో రేపు సాగర్లో జరగబోయే రేవంత్ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.