ఆత్మీయంగా పలకరించుకున్న రేవంత్, జగ్గారెడ్డి...ఆసక్తికర సన్నివేశం

ABN , First Publish Date - 2022-03-11T18:07:53+05:30 IST

సీఎల్పీ కార్యాలయంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం సీఎల్పీకి వచ్చారు.

ఆత్మీయంగా పలకరించుకున్న రేవంత్, జగ్గారెడ్డి...ఆసక్తికర సన్నివేశం

హైదరాబాద్: సీఎల్పీ కార్యాలయంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం  సీఎల్పీకి వచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి-రేవంత్ రెడ్డి ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఇన్ని రోజులూ ఉప్పు-నిప్పులా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఇద్దరూ ఆత్మీయంగా పలకరించుకుని కలిసిపోయినట్లుగా కనిపించారు. రేవంత్- జగ్గారెడ్డి నవ్వుతూ మీడియా ముందు ఐక్యంగానే కనిపించారు. అయితే.. ఇటీవల కాలంలో పీసీసీ అధ్యక్షుడిపై జగ్గారెడ్డి తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ క్రమంలో సీఎల్పీలో రేవంత్ ఎదురు పడగానే జగ్గారెడ్డి ఆప్యాయంగా పలకరించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇక ఇద్దరి మధ్య విభేదాల్లేవ్.. కలిసిపోయారని అభిమానులు, కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు.

Updated Date - 2022-03-11T18:07:53+05:30 IST