స్థానికత పరిగణనలోకి తీసుకోండి.. కేసీఆర్కు రేవంత్ లేఖ
ABN , First Publish Date - 2021-12-29T23:46:15+05:30 IST
సీఎం కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోస్టింగ్లలో స్థానికతను పరిగణనలోకి..
హైదరాబాద్: సీఎం కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోస్టింగ్లలో స్థానికతను పరిగణనలోకి తీసుకోవడంలేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అనుసరిస్తున్న మార్గదర్శకాలను రద్దు చేయాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతలతో చర్చించిన తర్వాత రూపొందించే కొత్త గైడ్లైన్స్ ఆధారంగా బదిలీలు చేపట్టాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగుల కేటాయింపు, బదిలీలు జీవో 3 ఆధారంగానే చేపట్టాలని, ఉపాధ్యాయుల కేటాయింపులో కౌన్సిలింగ్ విధానాన్ని అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. బదిలీల సమయంలో ప్రతి జిల్లాలో ఉన్న ఖాళీలను చూపించాలని లేఖలో రేవంత్రెడ్డి కోరారు.