అభివృద్ధి, సంక్షేమంలో వైఎస్ఆర్ దేశానికే ఆదర్శం: Revanth
ABN , First Publish Date - 2022-07-08T16:38:20+05:30 IST
అభివృద్ధి, సంక్షేమంలో వైఎస్ఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమంలో వైఎస్ఆర్ (YSR) దేశానికే ఆదర్శంగా నిలిచారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revamth reddy) అన్నారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పంజాగుట్టలో వైఎస్ విగ్రహానికి తెలంగాణ కాంగ్రెస్ నివాళులర్పించింది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ... వైఎస్ చేపట్టిన నీటి ప్రాజెక్టులు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. రాహుల్ గాంధీ (Rahul gandhi)ని దేశానికి ప్రధానిని చేయటం తన లక్ష్యమని వైఎస్ఆర్ చెప్పేవారని గుర్తుచేశారు. వైఎస్ఆర్ ఆలోచనల మేరకు రాహుల్ను ప్రధానిని చేసే వరకు విశ్రమించమని స్పష్టం చేశారు. పీవీ(PV), ఎన్టీఆర్(NTR), మర్రి చెన్నారెడ్డి(Marri chennareddy)ల మాదిరి.. హైదరాబాద్లో వైఎస్ స్ముతీవనాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్(KCr)కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ చేయకుంటే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హైదరాబాద్లో వైఎస్ స్ముతీవనం నిర్మిస్తామని తెలిపారు. వైఎస్ఆర్ ఆలోచనలను తెలంగాణ కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్తోందన్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి వైఎస్ అత్యంత విశ్వాస పాత్రడని అన్నారు. మాట ఇస్తే ఎన్ని కష్టాలొచ్చినా మడప తిప్పని నేత రాజశేఖరరెడ్డి అని అన్నారు. వైఎస్ఆర్ మన మధ్య లేకపోవడం బాధాకరమని రేవంత్ రెడ్డి ఆవేదన చెందారు.