గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్వాసితులపై దాడిని ఖండించిన Revanth

ABN , First Publish Date - 2022-06-13T15:03:07+05:30 IST

గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితుల అరెస్ట్‌‌ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండించారు.

గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్వాసితులపై దాడిని ఖండించిన Revanth

హైదరాబాద్: గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితుల అరెస్ట్‌‌ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘నీళ్లు పారాల్సిన ప్రాజెక్టుల్లో నిర్వాసితుల కన్నీళ్లు పారుతున్నాయి. బీళ్లు తడపాల్సిన ప్రాజెక్టులు నిర్వాసితుల రక్తంతో తడుస్తున్నాయి. సిద్ధిపేట జిల్లా గౌరవెల్లి - గండిపెల్లి నిర్వాసితులపై అర్ధరాత్రి పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుంది’’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 

Updated Date - 2022-06-13T15:03:07+05:30 IST