టెట్ను వాయిదా వేయండి... ట్విట్టర్ ద్వారా Revanth డిమాండ్
ABN , First Publish Date - 2022-06-10T17:55:00+05:30 IST
టెట్ను వాయిదా వేయాలంటూ ప్రభుత్వానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు.
హైదరాబాద్: టెట్ను వాయిదా వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. ఆర్ఆర్బీ, టెట్ రెండు ఒకే రోజున ఉండడం వల్ల ఒకదానికి మాత్రమే హాజరయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఉద్యోగం ఆశించే నిరుద్యోగులు... ఇందులో రెండింటికి హాజరు కావాలని భావిస్తున్నారని తెలిపారు. ఆర్ఆర్బి అనేది జాతీయ స్థాయి పరీక్ష అని... ఇది వాయిదా వేయడం కుదరుదన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర స్థాయి టెట్ను మరొక తేదీన నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. నిరుద్యోగుల ఆశలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే టెట్ను వాయిదా వేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.