మరోసారి Revanth హౌస్ అరెస్ట్
ABN , First Publish Date - 2021-12-31T13:47:08+05:30 IST
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని శయంపేటలో రచ్చబండ కార్యక్రమానికి కాంగ్రెస్ పూనుకుంది. ఈ క్రమంలో రచ్చబండకు వెళ్లకుండా రేవంత్ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. టీపీసీసీ చీఫ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
ఇటీవల సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న రేవంత్ను పోలీసులు అడ్డుకున్నారు. ఆరోజు ఉదయం నుంచి రేవంత్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు... ఆయనను బయటకు వెళ్లనీయకుండా గృహనిర్బంధం చేశారు. విషయం తెలిసిన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రేవంత్ నివాసానికి చేరుకున్నారు. పోలీసులను నెట్టుకుంటూ బయటకు వెళ్లేందుకు రేవంత్ యత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు అడ్డుకుని రేవంత్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.