అలా వస్తే మీరు దేశద్రోహులే: రేవంత్ రెడ్డి
ABN , First Publish Date - 2022-01-10T23:04:57+05:30 IST
చైనాలో తయారైన రామనుజాచార్యుల విగ్రహావిష్కరణకు రావద్దని, అలా
హైదరాబాద్: చైనాలో తయారైన రామనుజాచార్యుల విగ్రహావిష్కరణకు రావద్దని, అలా వస్తే మీరు దేశద్రోహులే అవుతారని ప్రధాని మోడీని ఉద్దేశించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నగరంలో ఆయన మాట్లాడారు. మోడీ ఎజెండాను కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆయన ఆరో్పిచించారు. బండి సంజయ్, మోడీ దేశభక్తి నేతి బీరకాయలో నేతి అంత అని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు మేక్ ఇన్ ఇండియా అని గొప్పలు చెబుతారని, గుజరాత్లో పెట్టిన సర్దార్ పటేల్ విగ్రహాన్ని చైనాలో ఎందుకు తయారు చేయించారని ఆయన ప్రశ్నించారు.
ముచ్చింతలలో పెట్టబోయే రామానుజాచారి విగ్రహం కూడా చైనాలోనే తయారైందని ఆయన తెలిపారు. చైనాలో తయారైన ఆ విగ్రహ ఆవిష్కరణకు మోడీ ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. అటువంటపుడు మీరు ఎలా దేశభక్తులు అవుతారన్నారు. ఇందిరాగాంధీ పేరెత్తే అర్హత అస్సాం సీఎం హేమంత బిశ్వాస్కు లేదన్నారు. 317జీవోను కేంద్రం నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సర్దార్ విగ్రహాన్ని చైనా నుంచి తెచ్చిన బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. మీరు దేశభక్తులు అయితే చైనాలో తయారైన రామనుజాచార్యుల విగ్రహావిష్కరణకు రావద్దన్నారు.