తెలంగాణ బిల్లు లాగా వర్గీకరణ బిల్లు: రేవంత్ రెడ్డి
ABN , First Publish Date - 2021-12-15T01:27:52+05:30 IST
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే తెలంగాణ బిల్లు లాగా
ఢిల్లీ: కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ బిల్లు లాగా ఎస్సీ వర్గీకరణ బిల్లు తెస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ సదస్సుల్లో ఆయన మాట్లాడారు. వర్గీకరణపై కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎందుకు ప్రస్తావించడం లేదన్నారు. దళితుల డిమాండ్ను కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. టీఆర్ఎస్ ఎంపీలను, ఎమ్మెల్యేలను ఈ సమావేశానికి ఎందుకు పంపించలేదన్నారు. పంజాబ్లో హామీ ఇవ్వకుండానే కాంగ్రెస్ దళితుడిని ముఖ్యమంత్రి చేసిందని ఆయన పేర్కొన్నారు. సోనియా, రాహుల్ గాంధీ అనుమతితో ఇక్కడకు వచ్చానని ఆయన పేర్కొన్నారు. తన కుటుంబ కోసం ఎంత చిత్తశుద్ధితో పని చేస్తానో ఏబీసీడీ వర్గీకరణ కోసం అంతే చిత్తశుద్ధితో పని చేస్తానని ఆయన ప్రకటించారు.
లక్ష్యం నెరవేరే వరకు మంద కృష్ణ మాదిగతో తాను ఉంటానని ఆయన తెలిపారు.