పీజేఆర్ లాంటి నాయకుడు కావాలి: రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2021-12-26T00:13:27+05:30 IST

టీపీసీసీ అధ్యక్షడు రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు

పీజేఆర్ లాంటి నాయకుడు కావాలి: రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షడు రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు పీజేఆర్ ( పి. జనార్ధన్ రెడ్డి) లాంటి నాయకుడు కావాలని రేవంత్ రెడ్డి అన్నారు. నగరంలోని గోపానపల్లి వడ్డెర కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ ప్రజలకు ఇళ్ల పట్టాలిస్తామని ప్రభుత్వం మోసం చేసిందన్నారు. 30 ఏళ్లుగా నివాసముంటున్నన్న విధంగా 60 గజాల భూమి పట్టాలు ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ కట్టించాలని ఆయన డిమాండ్ చేశారు.  వీళ్ళకి పట్టాలివ్వకుంటే పట్టాలు వచ్చే వరకు ఎమ్మెల్యే ఇంట్లోనే వీరందరికీ వంటా వార్పు చేస్తామని ఆయన హెచ్చరించారు. కూల్చిన ఇలాల్లోనే ఆడబిడ్డ ప్రసవం జరిగిందన్నారు. తక్షణమే మున్సిపల్ మంత్రి ఇక్కడికి రావాలన్నారు. స్థానికంగా ఉన్న 250 కుటుంబాలు 1000 మంది బాధ్యత మున్సిపల్ మంత్రి కేటీఆర్‌దేనని ఆయన పేర్కొన్నారు. తక్షణమే వారు ఇక్కడికి వచ్చి పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.


బాధితులకు తమ పార్టీ వీరికి అండగా ఉంటుందన్నారు. అధికారులతో, మున్సిపల్, జోనల్ కమిషనర్‌లతో మాట్లాడినట్లు తెలిపారు. కలెక్టర్, ఆర్డీవోలతో మాట్లాడి పట్టాలు ఇవ్వడానికి చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. పీజేఆర్ ఉంటే ఇలా జరిగేదా అని ఆయన ప్రశ్నించారు. పీజేఆర్ లాంటి నాయకుడు ఈ ప్రాంతానికి ఉండాలన్నారు. హైదరాబాద్ నగరంలో, తెలంగాణలో పీజేఆర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అన్నారు. 


Updated Date - 2021-12-26T00:13:27+05:30 IST