న్యూఢిల్లీ: టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) గురువారం దేశీయ మార్కెట్లోకి ఎస్యూవీ మోడల్ హైలక్స్ను విడుదల చేసింది. ఈ మోడల్ బుకింగ్స్ను ప్రారంభించినట్టు కంపెనీ తెలిపింది. డెలివరీలు ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ వాహనం 2.8 డీజిల్ ఇంజన్తో మాన్యువల్, ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్స్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. వచ్చే నెలలో ఈ మోడల్ ధరను కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది. కాగా దీని ధర రూ.25-30 లక్షల మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు.