ఇక సూర్యోదయాన మెరిసే మహల్ను సందర్శించండి!
ABN , First Publish Date - 2021-07-13T18:00:22+05:30 IST
అనిర్వచనీయమైన ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ను...
ఆగ్రా: అనిర్వచనీయమైన ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ను సందర్శించాలని ఎవరికి ఉండదు చెప్పండి... సూర్యోదయాన మెరిసే తాజ్మహల్ను చూసి పులకించపోవాలని చాలామంది కోరుకుంటారు. దేశంలో కరోనా సెకెండ్ వేవ్ ఉపశమించిన ప్రస్తుత తరుణంలో తాజ్ మహల్ పర్యాటకుల సందర్శనకు ముస్తాబై స్వాగతం పలుకుతోంది. భారత పురావస్తుశాఖ ఆధ్వర్యంలోని తాజ్ మహల్ సందర్శన వేళల్లో మార్పులు చోటచేసుకున్నాయి. ఇకపై యూపీలోని ఆగ్రాలో గల తాజ్ మహల్ ఉదయం ఆరు గంటలకే తెరుచుకోనుంది. దీంతో పర్యాటకులు ఉదయాన్నే తాజ్ మహల్ను సందర్శించేందుకు అవకాశం ఏర్పడింది. ఇంతకుముందు తాజ్మహల్ను ఉదయం ఏడు గంటలకు తెరిచేవారు. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ సమయాలను మార్పు చేసిన నేపధ్యంలో తాజ్ సందర్శన వేళలు మారాయి.