టూరిజం హోటల్‌ పనుల ప్రారంభం

ABN , First Publish Date - 2020-09-20T06:45:16+05:30 IST

ఇల్లెందు క్రాస్‌ రోడ్డు వద్ద గల టూరిజం హోటల్‌ పనులు ఎట్టకేలకు ప్రారం భానికి నోచుకున్నాయి...

టూరిజం హోటల్‌ పనుల ప్రారంభం

లక్ష్మీదేవిపల్లి, సెప్టెంబరు 19: అర్ధాంతరంగా నిలిచి పోయిన లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఇల్లెందు క్రాస్‌ రోడ్డు వద్ద గల టూరిజం హోటల్‌ పనులు ఎట్టకేలకు ప్రారం భానికి నోచుకున్నాయి. ఈ పనులను శనివారం కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ... గతంలో పనిచేసిన కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలను పాటించడంలో విఫలం చెందింది. ఆ కాం ట్రాక్టర్‌ చేతులెత్తేయడంతో హోటల్‌ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయన్నారు. హోటల్‌ పనులు తిరిగి ప్రారంభిం చేందుకు టూరిజం శాఖ అధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిపి దీంతో పంచాయతీరాజ్‌శాఖ కొత్త కాంట్రా క్టర్‌కు పనులు అప్పగించామని నాణ్యతలో రాజీపడకుండా హోటల్‌ పనులు ఆరు నెలల్లో పూర్తయ్యేలా కృషిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, ఎంపీపీ భూక్యా సోనా, ఎంపీటీసీ స్వాతి, సర్పంచ్‌లు పడిగె ప్రశాంత్‌, లాలు, శ్రీను, బండా వెంకటేశ్వర్లు, తాటి పద్మ, నాగేశ్వరరావు, ఉప సర్పంచ్‌ రజాక్‌, రమేష్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-20T06:45:16+05:30 IST