తోటపల్లి కిటకిట

ABN , First Publish Date - 2022-07-03T05:26:21+05:30 IST

ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి భక్తులతో శనివారం కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణ మార్మోగింది.

తోటపల్లి కిటకిట
ఆలయ ప్రాంగణంలో సుదర్శన హోమాలు నిర్వహిస్తున్న భక్తులు

ఘనంగా సుదర్శన హోమాలు

భారీగా తరలిచ్చిన భక్తులు

గరుగుబిల్లి, జూలై 2 : ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి భక్తులతో శనివారం కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణ మార్మోగింది. ఒడిశాతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తజనం అధిక సంఖ్యలో తరలివచ్చి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రముఖ యజ్ఞ యాగకర్త  శర్మయాజీ నేృత్వంలో సుదర్శన హోమాలు నిర్వహించారు. తొలుత ఉభయ దేవాలయాల్లో  సుప్రభాత సేవ, నిత్యారాధన, బాలభోగం,  పుణ్యహ వాచనం, సుదర్శన శతకంతో పాటు విశేష పూజలు చేశారు. ఆలయంలో భక్తులకు ఉచిత ప్రసాదాలు, అన్నసమారాధన నిర్వహించారు.  ఈ పూజల్లో ఆలయ ఈవో బి.లక్ష్మీనగేష్‌, సిబ్బంది ఎం.మురళీమోహన్‌నాయుడు, తదితరులు  పాల్గొన్నారు.  

 

Updated Date - 2022-07-03T05:26:21+05:30 IST