ఎమ్మెల్సీగా త్రిమూర్తులు
ABN , First Publish Date - 2021-06-22T06:32:45+05:30 IST
మండపేట, జూన్ 21: మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీగా శాసనమండలిలో సోమవారం ప్రమాణస్వీకారం చేశారు.
నేడు నియోజకవర్గానికి రాక.. భారీ ఊరేగింపునకు ఏర్పాట్లు
మండపేట, జూన్ 21: మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీగా శాసనమండలిలో సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. తోట ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర మంత్రులు అనిల్కుమార్యాదవ్, రంగరాజు, కన్నబాబు, టి.వనిత, పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తోటను అభినందించారు.