ఎమ్మెల్సీగా త్రిమూర్తులు

ABN , First Publish Date - 2021-06-22T06:32:45+05:30 IST

మండపేట, జూన్‌ 21: మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీగా శాసనమండలిలో సోమవారం ప్రమాణస్వీకారం చేశారు.

ఎమ్మెల్సీగా త్రిమూర్తులు
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తోటను అభినందిస్తున్న మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైసీపీ శ్రేణులు

నేడు నియోజకవర్గానికి రాక.. భారీ ఊరేగింపునకు ఏర్పాట్లు

మండపేట, జూన్‌ 21: మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీగా శాసనమండలిలో సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. తోట ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర మంత్రులు అనిల్‌కుమార్‌యాదవ్‌, రంగరాజు, కన్నబాబు, టి.వనిత, పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తోటను అభినందించారు.


Updated Date - 2021-06-22T06:32:45+05:30 IST