ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్.. టాస్ను అడ్డుకున్న వర్షం
ABN , First Publish Date - 2021-06-18T20:34:45+05:30 IST
ప్రపంచంలోని క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు
సౌతాంప్టన్: ప్రపంచంలోని క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు అనకున్నట్టే వరుణుడు అడ్డుతగిలాడు. సౌతాంప్టన్లో వర్షం కురుస్తుండడంతో టాస్ వేయడం సాధ్యం కాలేదు. ఇక్కడ వర్షం పడే అవకాశం 91 శాతం ఉందన్న వాతావరణ శాఖ అంచనాలు నిజమయ్యాయి. మైదానం మొత్తం మబ్బులతో నిండిపోయింది. ఇప్పటి వరకు టాస్ పడకపోవడంతో ఫస్ట్ సెషన్ పూర్తిగా వర్షార్పణమైనట్టే.
ఈ మ్యాచ్ కనుక జరగకుంటే భారత్, న్యూజిలాండ్ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఇప్పుడే ఆ విషయం చెప్పడం తొందరపాటే అవుతుందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. ఫైనల్ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కోహ్లీ, విలియమ్సన్ సేనలు పూర్తిగా సిద్ధమయ్యాయి. కివీస్పై ఏరకంగా చూసిన భారత్దే పైచేయి కావడంతో డబ్ల్యూటీసీ పైనల్ విజేతగా భారత్ నిలుస్తుందని ఇప్పటికే పలువురు తాజా, మాజీ క్రికెటర్లు అంచనా వేశారు. అయితే, సౌతాంప్టన్లో ప్రస్తుత పరిస్థితులు మ్యాచ్ను పూర్తిగా అడ్డుకునేలానే కనిపిస్తున్నాయి.