ఇంటినుంచి వెళ్లిపోయిన తల్లీకూతుళ్లు క్షేమం

ABN , First Publish Date - 2020-07-02T11:54:24+05:30 IST

కుటుంబ కలహాలతో ఇంట్లోంచి వెళ్లిపోయిన తల్లీ, ఇద్దరు కూతుళ్లను బుధవారం కుటుంబీకులకు పోలీసులు అప్పగించారు.

ఇంటినుంచి వెళ్లిపోయిన తల్లీకూతుళ్లు క్షేమం

తూప్రాన్‌, జూలై 1: కుటుంబ కలహాలతో ఇంట్లోంచి వెళ్లిపోయిన తల్లీ, ఇద్దరు కూతుళ్లను బుధవారం కుటుంబీకులకు పోలీసులు అప్పగించారు. తూప్రాన్‌ ఎస్‌ఐ సుభాష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తూప్రాన్‌ మండలం యావాపూర్‌కు చెందిన రిజ్వానా వివాహం కౌడిపల్లి మండలం రాచపేటకు చెందిన జహంగీర్‌తో జరిగింది. వారికి ఇద్దరు కూతుళ్లు ఆస్మా, సమీరా ఉన్నారు. వారి కుటుంబం తూప్రాన్‌లో కొన్ని రోజులుగా నివాసముంటోంది. జహంగీర్‌ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే జహంగీర్‌తో గొడవ జరగడంతో రిజ్వానా తమ కూతుళ్లను తీసుకొని జూన్‌ 4న ఇంటి నుంచి వెళ్లిపోయింది. జహాంగీర్‌ ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో రిజ్వానా మేడ్చల్‌లో నివాసముంటున్నట్లు తెలియయడంతో ఆమెతో పాటు ఆస్మా, సమీరాను బుధవారం తూప్రాన్‌ పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. భార్యాభర్తలకు ఎస్‌ఐ కౌన్సెలింగ్‌ నిర్వహించి, పంపించారు.

Updated Date - 2020-07-02T11:54:24+05:30 IST