సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రస్థానం

ABN , First Publish Date - 2022-08-11T06:21:28+05:30 IST

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోందని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. మండలంలోని రేపాకలో బుధవారం లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు.

సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రస్థానం
చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే

- మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌

ఇల్లంతకుంట, ఆగస్టు 10: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోందని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. మండలంలోని రేపాకలో బుధవారం లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద ఆడబిడ్డల వివాహాలకు సీఎం కేసీఆర్‌ కుటు ంబ పెద్దగా అండగా నిలుస్తున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికి చేరుతున్నాయన్నారు. జడ్పీవైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు, సర్పంచ్‌ రొండ్ల లక్ష్మి, ఎంపీటీసీ కాథ సుమలతమల్లేశం, ఫ్యాక్స్‌ చైర్మన్‌ రొండ్ల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ గుడిసె అయిలయ్యయాదవ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహరెడ్డి, రైతుబంధు జిల్లా డైరెక్టర్‌ ఏలేటి మాధవరెడ్డి, మీడియాసెల్‌ ఇన్‌చార్జి అనీల్‌కుమార్‌ పాల్గొన్నారు.

- ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా ఎగురవేసి జాతీయతను చాటుకోవాలని రసమయి బాలకిషన్‌ అన్నారు. మండలంలోని రేపాకలో ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిర్దేశిత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టారు. 

Updated Date - 2022-08-11T06:21:28+05:30 IST