అభివృద్ధిలో అగ్రస్థానం

ABN , First Publish Date - 2021-10-28T05:12:57+05:30 IST

టీఆర్‌ఎస్‌ ఏడేళ్ల పాలనలో అభివృద్ధిలో తె లంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.

అభివృద్ధిలో అగ్రస్థానం
కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి నిరంజన్‌రెడ్డి

- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

 

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, అక్టోబరు 27: టీఆర్‌ఎస్‌ ఏడేళ్ల పాలనలో అభివృద్ధిలో తె లంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మహేంద్రనాథ్‌ చౌరస్తా టీఆర్‌ఎస్‌ కార్యాలయం ఆవరణంలో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమా వేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో పాటు ఎంపీ పోతుగంటి రాములు హాజరై ప్రసంగించారు.  అనంతరం టీఆర్‌ఎస్‌ మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయించి పార్టీ ఐడీ కార్డులను అందించారు. జడ్పీ చైర్‌ పర్సన్‌ పెద్దపల్లి పద్మావతి, డీసీసీబీ డైరెక్టర్‌ జక్కా రఘునందన్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ కల్పన, టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-28T05:12:57+05:30 IST