టాప్ 1000 కంపెనీలకు డివిడెండ్ పాలసీ తప్పనిసరి
ABN , First Publish Date - 2021-05-12T06:27:04+05:30 IST
కార్పొరేట్ పాలనా ప్రమాణాలు మరింత పటిష్ఠం చేసే దిశగా సెబీ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా దేశంలో మార్కెట్ విలువ పరంగా అగ్రస్థానంలో నిలిచిన వెయ్యి లిస్టెడ్ కంపెనీలు...
న్యూఢిల్లీ: కార్పొరేట్ పాలనా ప్రమాణాలు మరింత పటిష్ఠం చేసే దిశగా సెబీ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా దేశంలో మార్కెట్ విలువ పరంగా అగ్రస్థానంలో నిలిచిన వెయ్యి లిస్టెడ్ కంపెనీలు డివిడెండ్ పంపిణీ విధానాన్ని ప్రకటించడం తప్పనిసరి చేసింది. ఇప్పటివరకు అది టాప్ 500 కంపెనీలకే పరిమితం. మిగతా కంపెనీలు ఈ విధానం ప్రకటించడం అనేది ఐచ్ఛికమని తెలిపింది.