ముగిసిన టోనీ పోలీసు కస్టడీ

ABN , First Publish Date - 2022-02-03T02:26:39+05:30 IST

డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు టోనీ పోలీసు కస్టడీ

ముగిసిన టోనీ పోలీసు కస్టడీ

హైదరాబాద్‌: డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు టోనీ పోలీసు కస్టడీ ముగిసింది. ఐదు రోజుల పాటు టోనీని పోలీసులు విచారించారు. టోనీతో సంబంధాలు ఉన్న పలువురిని పోలీసులు అరెస్ట్  చేశారు. టోనీ, వ్యాపారవేత్తల మధ్య ఏజెంట్లుగా ఉన్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. టోనీ దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసిన పలువురు ప్రముఖులను గుర్తించారు. టోనీతో డ్రగ్స్ లావాదేవీలు జరిపిన వారికోసం పోలీసులు గాలింపు చేపట్టారు. టోనీ సమాచారం మేరకు నార్కోటిక్ కంట్రోల్ సెల్, టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగాయి. టోనీ కాల్ డేటా, డార్క్ నెట్ వెబ్సైట్, ఇంటర్నెట్ కాల్స్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. మూడు బ్యాంక్ ఎకౌంట్స్ లావాదేవీలను  పోలీసులు పరిశీలించారు. టోనీని పోలీసులు మరోసారి కస్టడీకి కోరే అవకాశం ఉంది. అరెస్టయిన టోనీ ఏజెంట్లను పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు.  


Updated Date - 2022-02-03T02:26:39+05:30 IST