టీడీపీ భారీ బహిరంగసభకు సర్వం సిద్ధం
ABN , First Publish Date - 2022-05-28T02:21:37+05:30 IST
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఒంగోలు సమీపంలో భారీ బహిరంగసభ జరగనుంది. రెండురోజుల పాటు ఇక్కడ జరుగుతున్న
ఒంగోలు: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఒంగోలు సమీపంలో భారీ బహిరంగసభ జరగనుంది. రెండురోజుల పాటు ఇక్కడ జరుగుతున్న టీడీపీ మహానాడు ముగింపు సందర్భంగా ఈ సభ నిర్వహిస్తుండగా ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచే లక్ష మందికిపైగా ప్రజలు, టీడీపీ కార్యకర్తలు హాజరుకానున్నారు. నగర సమీపంలోని మండవవారిపాలెం పొలాల్లో ఏర్పాటు చేసిన మహానాడు ప్రాంగణంలోనే ఈ సభను నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సభ జరగనుండగా సాయంత్రం ఐదు గంటలకు పార్టీ అధినేత నారా చందద్రబాబు ప్రసంగిస్తారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు, కొండపి, కనిగిరి నియోజకవర్గాల నుంచి భారీ జనసమీకరణ జరుగుతుండగా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా పెద్దఎత్తున కార్యకర్తలు తరలిరానున్నారు.