రేపు ఎస్టీయూ రాష్ట్ర వ్యాప్త నిరసనలు
ABN , First Publish Date - 2022-08-09T07:07:48+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మి క పెన్షనర్ల బకాయిలు చెల్లించాలని డిమాం డ్ చేస్తూఈనెల 10న డీటీవో కార్యాలయాలు ఎదుట జరిగే ధర్నాలను జయప్రదం చేయా లని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూరి జయత్రినాథబాబు, జిల్లా ప్రధాన కార్య దర్శి లక్ష్మణ్ కోరారు.
దివాన్చెరువు, ఆగస్టు 8: రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మి క పెన్షనర్ల బకాయిలు చెల్లించాలని డిమాం డ్ చేస్తూఈనెల 10న డీటీవో కార్యాలయాలు ఎదుట జరిగే ధర్నాలను జయప్రదం చేయా లని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూరి జయత్రినాథబాబు, జిల్లా ప్రధాన కార్య దర్శి లక్ష్మణ్ కోరారు. సోమవారం దివాన్చెరు వులో మండలాధ్యక్షుడు ఎంఎస్ ఎస్పి కు మార్ అధ్యక్షతన జరిగిన సన్నాహక సమా వేశానికి వారు అతిథులుగా విచ్చేసి మాట్లా డారు. బుధవారం ఉదయం 10గంటలకు రాష్ట్రంలోని 26 జిల్లాల ఖజానా కార్యాలయా లు ఎదుట నిరసన ధర్నాలు జరుగుతాయ న్నారు. ఏడాదిగా ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మి క పెన్షనర్లకు రావలసిన భవిష్యనిధి రుణా లు, జీవిత బీమా చెల్లింపులు, సంపాదిత సెలవు నగదీకరణ బిల్లులు, కరువు భత్యం బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు.. జాతీ య విద్యా విధానం పేరుతో 3,4,5 తరగ తుల విలీనాన్ని విరమింంచి జీవో 117, 128 లను రద్దు చేయాలన్నారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు 62 ఏళ్లకు పదవీ విరమణ ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 కింద జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.