రేపు సార్వత్రిక సమ్మె
ABN , First Publish Date - 2020-11-25T06:38:02+05:30 IST
కార్మిక సంఘాలు మరోసారి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా గురువారం సమ్మె చేయాలని 10 కార్మిక సంఘాలు నిర్ణయించాయి...
న్యూఢిల్లీ: కార్మిక సంఘాలు మరోసారి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా గురువారం సమ్మె చేయాలని 10 కార్మిక సంఘాలు నిర్ణయించాయి. బ్యాంకింగ్, రక్షణ, రైల్వేలతో పాటు వివిధ రంగాలకు చెందిన దాదాపు 25 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారని అంచనా. సులభతర వాణిజ్యం పేరు తో ప్రభుత్వం కార్మిక చట్టాలను తుంగ లో తొక్కుతోందని ఐఎన్టీయూసీ, ఏఐటీయూసితో సహా పది కార్మిక సంఘాలు ఆరోపించాయి.