ఏపీలో రేపు మినీ పల్లె పోరు

ABN , First Publish Date - 2021-11-13T23:17:02+05:30 IST

ఏపీ ఆదివారం మినీ పల్లె పోరు సిద్ధమైంది. మిగిలిపోయిన గ్రామ పంచాయితీలకు ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.

ఏపీలో రేపు మినీ పల్లె పోరు

విజయవాడ: ఏపీ మినీ పల్లె పోరు సిద్ధమైంది.  ఆదివారం మిగిలిపోయిన గ్రామ పంచాయితీలకు ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల సన్నాహకాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్‌ఈసీ నీలం సాహ్ని సమీక్ష నిర్వహించారు. మొత్తం 69 స్ధానాల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటికే 30 స్ధానాలు ఏకగ్రీవం అయ్యాయి. 36 పంచాయితీల్లో ఆదివారం సర్పంచ్‌ స్ధానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

Updated Date - 2021-11-13T23:17:02+05:30 IST