టమాటో ట్రేలు మాయం..!
ABN , First Publish Date - 2021-11-28T02:44:05+05:30 IST
కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు సత్రం సెంటర్లో ఒక కూరగాయల దుకాణంలో శుక్రవారం రాత్రి టమాటాల ట్రేలు చోరికి గురయ్యాయి.
విజయవాడ: కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు సత్రం సెంటర్లో ఒక కూరగాయల దుకాణంలో శుక్రవారం రాత్రి టమాటాల ట్రేలు చోరికి గురయ్యాయి. టమాటా ధర కొండెక్కటంతో చోరుల దృష్టి వాటిపై పడింది. మిగిలిన కూరగాయలను వదిలిపెట్టి టమాటా ట్రేలు మాత్రం మాయం చేశారు. జగ్గయ్యపేట మార్కెట్లో కేజి రూ.70 - రూ.100ల వరకు పలుకుతుండటమే దీనికి కారణమని భావిస్తున్నారు. రూ.6వేలు నష్టం వాటిల్లినట్టు వ్యాపారి సూరిబాబు వాపోయాడు. విలువైన వస్తువుల జాబితాలో టమాటా కూడా చేరటంతో ప్రజలు వింతగా చెప్పుకుంటున్నారు.