రేపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా

ABN , First Publish Date - 2021-02-27T04:07:47+05:30 IST

శ్రీసిటీలోని మొబైల్‌ కంపెనీలో పనిచేసేందుకు మహిళలకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం జాబ్‌ మేళా నిర్వహిస్తారని కళాశాల ప్రిన్సిపాల్‌ ఉమామహేశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు.

రేపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 26 : శ్రీసిటీలోని మొబైల్‌ కంపెనీలో పనిచేసేందుకు మహిళలకు   స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం జాబ్‌ మేళా నిర్వహిస్తారని కళాశాల ప్రిన్సిపాల్‌ ఉమామహేశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివి 18 నుంచి 28 సంవత్సరాల వయస్సు కలిగిన వారు అర్హులని తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ. 11,120  జీతంతోపాటు ఉచిత భోజనం, రవాణా సౌకర్యం కల్పిస్తారని తెలిపారు. ఆసక్తిగల వారు ఆధార్‌కార్డు, ఒరిజనల్‌ సర్టిఫికెట్లతో ఆదివారం ఉదయం 9 గంటలకు హాజరుకావాలని తెలిపారు. ఇతర వివరాలకు కళాశాల జేకేసీ కోఆర్డినేటర్‌ రాజశేఖర్‌ (9940262986)ను లేదా 7702432117ను సంప్రదించాలని కోరారు.


Updated Date - 2021-02-27T04:07:47+05:30 IST