Telangana: డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న ఈడీ విచారణ
ABN , First Publish Date - 2021-09-04T14:06:33+05:30 IST
టాలీవుడ్లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ముగ్గురు సినీ ప్రముఖలకు ఈడీ విచారించింది.
హైదరాబాద్: టాలీవుడ్లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ముగ్గురు సినీ ప్రముఖలకు ఈడీ విచారించింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ను 10 గంటలు, ఛార్మిని 8 గంటలు, రకుల్ను 6 గంటల పాటు ఈడీ విచారించింది. ఈ ముగ్గురు తారల ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు స్టేట్ మెంట్లను పరిశీలించింది. హైదరాబాద్లో సాగుతున్న డ్రగ్స్ కేసును ఢిల్లీ ఈడీ బృందం మానిటరింగ్ చేస్తోంది. తెలంగాణ ఎక్సైజ్ శాఖ నివేదిక, ఎన్సీబీ రిపోర్ట్ ఆధారంగా టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఈడీ విచారిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ డ్రగ్స్ లింకులు బదిలీ అయిన నగదు లావాదేవీలపై ప్రశ్నిస్తోంది. కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు అందజేసింది. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 22 వరకు సినీ తారలను విచారించనుంది. 2016 నుండి జరిగిన బ్యాంకు లావాదేవీలను ఈడీ పరిశీలిస్తోంది. సెప్టెంబర్ 8న హీరో దగ్గుబాటి రానా ఈడీ ముందు హాజరుకానున్నారు.