ఉపాధిహామీలో అక్రమాలను సహించం

ABN , First Publish Date - 2021-09-17T04:43:33+05:30 IST

ఉపాధిహామీలో జరిగే అక్రమాలపై సహించేది లేదని డీఆర్డీవో రవికృష్ణ అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో 11వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు.

ఉపాధిహామీలో అక్రమాలను సహించం
ప్రజావేదికలో పాల్గొన్న జిల్లా అధికారులు

-డీఆర్డీవో రవికృష్ణ

బెజ్జూరు, సెప్టెంబరు 16: ఉపాధిహామీలో జరిగే అక్రమాలపై సహించేది లేదని డీఆర్డీవో రవికృష్ణ అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో 11వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. 2018-21 వరకు ఉపాధిహామీ పథకంలో రూ.17కోట్ల అభివృద్ధి పనులపై సామాజిక తనిఖీలు నిర్వహిం చారు. గురువారం సాయంత్రం వరకు 11 గ్రామ పంచాయతీల్లో నివేదికలు చదివి వినిపించారు. శుక్ర వారం కూడా ప్రజావేదిక కొనసాగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీఆర్డీవో కుటుంబరావు, ఎంపీడీవో గంగాసింగ్‌, ఏపీవో రామకృష్ణ, ఎస్‌ఆర్పీ కిష్టయ్య ఉన్నారు.

Updated Date - 2021-09-17T04:43:33+05:30 IST