టోక్యో పతాకధారి రేసులో సింధు
ABN , First Publish Date - 2021-06-26T09:08:20+05:30 IST
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ వేడుకల్లో భారత పతాకధారి (ఫ్లాగ్ బేరర్) రేసులో ఉంది.
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ వేడుకల్లో భారత పతాకధారి (ఫ్లాగ్ బేరర్) రేసులో ఉంది. ఈసారి ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత జట్టు నుంచి ఇద్దరు (ఓ పురుష, మహిళ) అథ్లెట్లు పతాకధారిగా వ్యవహరించనున్నారు. దీంతో మహిళల నుంచి రియో ఒలింపిక్స్ రజత పతక విజేత సింధుకు ఆ చాన్స్ దక్కే అవకాశముందని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) వర్గాలు తెలిపాయి. పురుషుల్లో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, టీటీ స్టార్ శరత్ కమల్, రెజ్లర్ బజ్రంగ్ పూనియా పేర్లు వినిపిస్తున్నాయి. కాగా.. పతాకధారి ఎవరన్నది ఈ నెలాఖరులో ఐఓఏ అధికారికంగా ప్రకటించనుంది.