ఒలింపిక్స్లో భారత్కు పతకాల పంట..! చరిత్రలో తొలిసారిగా..
ABN , First Publish Date - 2021-08-08T00:25:37+05:30 IST
టోక్యో ఒలింపిక్స్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఒక స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్య పతకాలు..మొత్తంగా చూస్తే ఏడు పతకాలు భారత్ సొంతమయ్యాయి. ఒలింపిక్స్ చరిత్రలో భారత్కు ఇదే అత్యధిక పతకాల రికార్డు కావడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: టోక్యో ఒలింపిక్స్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఒక స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్య పతకాలు..వెరసి ఏడు పతకాలు భారత్ సొంతమయ్యాయి. ఒలింపిక్స్ చరిత్రలో భారత్కు ఇదే అత్యధిక పతకాల రికార్డు కావడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటుతున్నాయి. 2012లో లండన్ ఒలింపిక్స్లో ఆరు పతకాలు సాధించిడం ద్వారా భారత్ అప్పట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. నాటి రికార్డును భారత అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్లో అధిగమించారు. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజతం రూపంలో టోక్యో ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకం అందించింది. ఇటీవల రెజ్లింగ్ స్టార్ పునియా కాంస్యం సాధించడంతో టోక్యో ఒలింపిక్స్లో భారత పతకాల సంఖ్య 6కు చేరింది. నేటి జావెలిన్ త్రో ఫైనల్స్లో కళ్లుచెదిరే ప్రదర్శనతో నీరజ్ చోప్రా ఏకంగా బంగారు పతకాన్ని సాధించి.. భారత పతకాల పట్టికలో మరో మెడల్ను చేర్చాడు. దీంతో..మొత్తం పతకాల సంఖ్య ఏడుకు చేరుకుంది.