తిరుమల: వేంకటేశ్వరస్వామిని వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్ నెల దర్శన టోకెన్ల కోటాను 8వ తేదీన ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. సాఫ్ట్వేర్లో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల 1వ తేదీకి బదులు 8వ తేదీకి దర్శన టోకెన్ల విడుదలను వాయిదా వేశారు. రోజుకు వెయ్యి టోకెన్ల చొప్పున జారీ చేస్తారు. ఏప్రిల్ 9వ తేదీ నుంచి నిర్దేశించిన స్లాట్లో వీరిని దర్శనానికి అనుమతిస్తారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రెండేళ్ల తర్వాత వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాన్ని టీటీడీ పునరుద్ధరించింది. వీరిని రోజూ ఉదయం 10 గంటల స్లాట్లో దివ్వాంగుల క్యూలైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. శుక్రవారం మాత్రం మధ్యాహ్నం 3 గంటల స్లాట్ కేటాయించారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
ఇవి కూడా చదవండి